Monday, September 14, 2015

"మేము లొంగం
2002 గుజరాత్ దాడులకు బాధ్యులైన 120మందిని శిక్షార్హుల్నిచేసి  న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న తీస్తా సేతల్వాద్  తో "ఫ్రంట్ లైన్" అనుపమ కటకం ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలు   
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో తీవ్రమైన ఇబ్బందులకు గురౌతున్న వ్యక్తి  తీస్తా సెతల్వాద్.  జ్వలించే కార్యకర్తగా,న్యాయవాదిగా 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయ మందించటం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న  తీస్తా సెతల్వాద్  ఇటీవలి నెలలలో తీవ్రమైన కక్ష్య సాధింపు వేటకు గురౌతున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రధాన నిందితుడుగా వున్న"జాకియా జెఫ్రి కేసు"కు సంబంధించిన  వాదనలు గుజరాత్ హైకోర్టులో  తుది స్థాయికి చేరటంతో తనపై దాడులు ఉధృత మౌతున్నాయని తీస్తా సెతల్వాద్  విశ్వసిస్తున్నారు. ఆయన ప్రధాన మంత్రి అయినప్పటికీ, ఇటీవలి కాలంలో సంభవించిన భయంకరమైన మతహింసలో తనపై పడ్డ మచ్చను ఆయన  విజవంతంగా   తుడిపించుకోగలిగినప్పటికీ,  2002 మతహింస బాధితులు కనుమరుగు కాకుండా నిలబెట్టడంలో తీస్తా సెతల్వాద్  నిర్వహిస్తున్న  బృహత్తర ప్రయత్నాలు  నరేంద్ర మోడీ కి కంటకంగానే వున్నాయి. తనను హింసించటం ద్వారా మత ఘర్షణల కేసుల్ని నీరు కార్చడానికి  బాహాటంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. 

మత సామరస్యం కోసం కృషి చేస్తున్న ఒక ప్రభుత్వేతర సంస్థ అయిన' సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్(సి జె ఐ )" ను ఆమె, ఆమె భర్త జావేద్ ఆనంద్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఆ దంపతుల పైన గుజరాత్ పోలిస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)లు అనేక అభియోగాల్ని మోపింది. 
ఇతర అంశాలతోపాటు మత ఘర్షణల సాక్షులను ట్యూటర్ చేస్తున్నారని, గుల్బెర్గ్  సొసైటీ బాధితుల నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారని, విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు వారిపై బనాయింప బడ్డాయి. 
జూలై నెల తొలిరోజుల్లో నిధుల దుర్వినియోగం కేసులో సిబిఐ ఆమె ఇంటిని, ఆఫీసును సోదా చేసింది. ఫిబ్రవరి నెలలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆమెను,ఆమె భర్త ఆనంద్ ను అరెస్ట్ చేయటానికి ప్రయత్నించింది. ఆమె ముంబై హైకోర్టు నుండి ముందస్తు బైలును పొందింది. అది సుదీర్ఘ మైన,కష్టతరమైన పోరాటమని ఆమెకు తెలుసు. మోడీ ప్రధాన మంత్రి హోదాలో కేంద్ర ఏజెన్సీల సహకారంతో తనను బాధించ గలడని ఆమె అంటుంది. 
మత ఘర్షణలు జరిగిన గత 13 సంవత్సరాల నుండి  తీస్తా సెతల్వాద్  ,ఆనంద్ కలసి 68 కేసుల్లో పోరాడి 120 మందికి శిక్షలు పడేటట్లు కృషి చేశారు. ఆమె ఎదుర్కొంటున్ననిర్బంధంతో  పాటు, ఆమెకు వివిధ వర్గాల నుండి  మద్దతు వెల్లువెత్తింది. న్యాయం కోసం నినదించే ఏ నిరసనైనా,నినాదమైనా జాతి వ్యతిరేకంగా పరిగణింప బడుతున్నఈ  రోజుల్లో, పౌర బృందాలు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మాజీ బ్యూరోక్రట్లు ఆమె తరఫున బహిరంగంగా మాట్లాడుతున్నారు. 
ఫ్రంట్ లైన్  తీస్తా సెతల్వాడ్ తో సంభాషించింది. . తన బాటను విడనాడేది లేదని  ఆమె వ్యక్తం చేసిన కృత నిశ్చయాన్ని ఆమె మాటలలోనే  చూద్దాం
జనవరి 2014 లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో ప్రధమ సమాచార నివేదిక(ఎఫ్ ఐ ఆర్) దాఖలు చేసినప్పటి నుండి మీరు నిరంతరం అరెస్ట్ బెదిరింపులను ఎదుర్కొన్నారు, మీ అకౌంట్స్ స్తంభింప బడ్డాయి, మిమ్మల్ని లక్ష్యం చేసికోవటంలో ఉద్దేశ్యాన్ని ఏమని  అనుమానిస్తున్నారు? 
గుల్బెర్గ్  సొసైటీ ఉచకోతలో బ్రతికి బైట పడ్డవారు తమ వ్యక్తిగత ఆస్తుల్ని సముచిత ధరకు అమ్ముకోలేని కారణంగా, దాదాపు 2007-8లోగుల్బెర్గ్  సొసైటీ లో ఒకమెమోరియల్ నిర్మాణం  కోసం నిధుల్ని సమీకరించటానికి  ప్రయత్నించాలని సమిష్టిగా నిర్ణయింప బడింది. సబ్రంగ్ ట్రస్ట్-సిజెపి చెందిన మేము రూ. 4.6లక్షల నిధుల్ని సమీకరించడం తప్ప, మాకు మెమోరియల్ తో ఏ రకమైన సంబంధం లేనందువల్ల, 2012లోసొసైటీ సభ్యులకు ప్రాజెక్ట్ సాధన సాధ్యంకాదని చెప్పాల్సి వచ్చింది.ఏ విధమైన ఒప్పందం పై సంతకాలు చేయబడలేదు, ఏ రకమైన ఆస్తి లేదా దస్తావేజులు చేతులు మారలేదు. ఏ రకమైన కిరాయి కుదర్చబడలేదు, డబ్బులు చేతులు మారలేదు. భారత దేశ సంతతికి చెందిన ఒకరితో సహా, భారతీయులందరూ కలసి రూ.4. 6లక్షల విరాళాలు అందచేశారు.ఆ సొమ్ము  ఇంకా వినియోగింప బడకుండా అట్లానే  వుంది. 
జనవరి 2013 లో మొట్టమొదటగా ఫిర్యాదు చేయబడింది. జనవరీ 2014లో ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయబడింది. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరమైనా ఇంతవరకు ఛార్జి షీట్ దాఖలు చేయబడలేదు. మా దృష్టిలో ప్రధమ సమాచార నివేదిక ద్వేషపూరితంగా ప్రేరింప బడింది. దీన్ని ఫిరోజ్ సయీద్ ఖాన్ చే దాఖలు చేయబడింది. ఫిరోజ్ సయీద్ ఖాన్ గుల్బెర్గ్ కేసు లో ప్రత్యక్ష సాక్షి సోదరుడు మరియు సొసైటీ నివాసి. కానీ ఊచకోత జరిగిన సందర్భంలో సంఘటన స్థలంలో ఆయన లేడు . సి జె పి మాజీ  ఉద్యోగి ని అదికార వర్గాలు ప్రణాళికా బద్ధంగా వినియోగించుకొన్నారు. ఆయన  నాపై 5 కేసులు బనాయించారు. ఆయన క్రైమ్ బ్రాంచ్ సాక్షి కూడ. 
గుజరాత్ ప్రభుత్వం మమ్మల్ని అగౌరవ పరుస్తూ, పోలిస్ అదుపులో నిర్భందిస్తూ పనికట్టుకొని మమ్మల్ని అపఖ్యాతి పాల్జేస్తున్నట్లుంది.  క్రైమ్ బ్రాంచ్ పరిశోధనాదికారి 2015పిబ్రవరి 2015 న మా ఇంటి ముందు ప్రదర్శించిన పూర్తి స్థాయి తమాషా ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. క్రైమ్ బ్రాంచ్ తన అఫిడవిట్ లో పేర్కొన్న వాదనలకు  వేటికి డాక్యుమెంటరీ ఋజువులు లేవు. ఇంతవరకు ఏ విధమైన అభియోగ పత్రం(చార్జి షీటు) దాఖలు చేయబడలేదు. ట్రస్ట్ నిధులు కాకుండా, మా డబ్బును మేమెలా ఖర్చు పెట్టుతున్నమో తెలిసికొని, మాపై అసభ్యకర ప్రచారానికి పూనుకొని   మా జీవితాల్లో జోక్యం చేసికోవాలనుకునే కుటిల యత్నమిది.  తీవ్రవాద వ్యతిరేక స్క్వాడ్ ముఖ్య నేత హేమంత్ కర్కరేను ఇదే విధంగా హింసించి 2008 నవంబర్ 28న భయంకరంగా చంపేశారు. 
మమ్మల్ని న్యాయపరమైన  చిక్కుల్లోకి స్పష్టంగా నెట్టి, మరో ప్రక్క భారత రాజ్యాంగాన్ని సమున్నతంగా నిలబెట్టుతూ,  ప్రభుత్వం యొక్క సైదాంతిక చట్రాన్ని సవాలు చేస్తున్న మా ప్రయత్నాలను స్థంబింప చేయటమే వాళ్ళ  ఉద్దేశ్యంగా వుంది. 
సి బి ఐ   మిమ్మల్ని జనవరి 2013 నుండి విచారిస్తూనే వుంది. ఇటీవలవారు మిమ్మల్ని  "జాతికే ఉపదవ్రం" గా అభివర్ణిస్తున్నారు 
 మత సామరస్యం,శాంతి  కోసం కృషి చేసే వారంతా "జాతికి ఉపద్రవం" కల్గించే వారనుకుంటే, మేమూ అటువంటి వారమే. మా పోరాటం,ఆరాట మంతా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిలబెట్టడమే. మన రాజ్యాంగ మౌళిక విలువల్ని నిలబెట్టడం కోసమే మేము కృషి చేస్తున్నాం. జాతికి ముప్పుగా మేము చూడబడటం లేదు. వారసత్వంగా రాజ్యాంగ వ్యతిరేక ప్రాపంచిక దృక్పధం కల్గిన  ఆర్ ఎస్ ఎస్ సారధ్యంలోని  పాలకులకు మాత్రం మేము  ముప్పు గా కనబడుతున్నాం.  విచ్చిన్నకర,ద్వేష రాజకీయాలను విశ్వసిస్తున్న వారికి  మేము ముప్పుగానే వున్నాం. ఈ శక్తులేన్నడూ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు. భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఉన్నతమైన నిబద్ధతా నియమాలతో వారికి సంబంధం లేదు. 
మీపై మోపబడ్డ అభియోగాలేమిటి? మీరు ప్రతి అంశంలోనూ సహకరించామని చెప్తున్నారు, కాని వాళ్ళు మీ ఇంటిని/ఆఫీస్ ను దాడిచేసి  సోదా చేశారు. న్యాయపరమైన దృక్కోణంలో ఆలోచిస్తే, ఇవ్వన్నీ చేయటానికి వారికి అధికారం వుందా?
దాడులు,సోదాలతో వారు న్యాయ ప్రక్రియను అతిక్రమించారు. సోదా వారంట్  ను పొందటంలో పోలిస్ అనుసరించిన చర్యల్ని మేము దాన్ని  జారీచేసిన మేజిస్ట్రేట్ ముందు సవాలు చేశాము (సోదాలు జరిపిన 2 రోజుల తర్వాత జూలై 17న వారంట్ జారీ చేసారు), మిమ్మల్ని తప్పుదోవ పట్టించారని మేజిస్ట్రేట్ కు చెప్పాము. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 192-193 కు అనుగుణంగా సి బి ఐ ఎటువంటి చర్యలు అమలు చేయలేదు. రాజ్యంగ హక్కుల పూర్తి ఉల్లంఘన జరిగిందని మేము నమ్ముతున్నాం. మా అభ్యర్ధన పై ఒక నోటీస్ ఇవ్వబడింది. ఆగస్ట్ లో దానిపై విచారణ జరుగుతుంది. మా మీద అనేక అభియోగాలు మోపబడ్డాయి. వాటన్నింటిని ఖండిస్తూ సమాధానాలిచ్చాం. సాధ్యమైనంత వరకు సహకరిస్తూనే వున్నాం. దాదాపు 24000పేజీల పత్రాల్ని మేము సి బి ఐ కి అందించాం. 
సంస్థాపక పత్రాలను బట్టి  సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్","సబ్రంగ్ ట్రస్ట్ "ల ఆశయాలు ఆదర్శాలు విశాల ప్రాతిపదికన విస్తృతమైన కార్యకలాపాలు నిర్వహించ కలిగేటట్లుగా వున్నాయి. అయినప్పటికీ 2002లో  సి జె పి స్థాపన నుండి సామూహిక నేరాలకు బలైన  బాధితులకు న్యాయ సహాయం అందించట దాని ముఖ్య కర్తవ్యంగా వుంది.  స్కూళ్ళలో ఖోజ్(బహుళ జన భారతానికి విద్య నందించే వేదిక) కార్యకలాపాలకు, ఘర్షణల నివారణ మరియు శాంతి స్థాపనలపై సబ్రంగ్ ట్రస్ట్ ప్రధానంగా కేంద్రీకరిస్తున్నది. గుల్బెర్గ్  మెమోరియల్ విషయంలో నేను ఇంతకు ముందు చెప్పినట్లు నిధులు వసూలు చేయబడ్డాయి. కాని కేవలం రూ4.6లక్షలు మాత్రం వసూలైనందున .ప్రాజెక్ట్ సాధన సాధ్యం కాదని సొసైటీ సభ్యులకు తెలియచేశాం. ఆ డబ్బు కదిలించకుండా ఆట్లానే వుంది. 
న్యాయ సహాయానికి నిధులు వసూలు చేయటం,కార్యక్రమాలు నిర్వహించటానికి సంబంధించి, గుజరాత్ మారణ హోమ బాధితులకు న్యాయ సహాయం అందించటం కోసం  సి. జె.పి భారత దేశం లోనే అపూర్వమైన పాత్రను  నిర్వహించింది. పాలన వ్యవస్థ శత్రుపూరితంగా వున్నప్పటికీ, విచారణ సందర్భంగా బాధితులకు  రక్షణను, స్థైర్యాన్ని కల్పిస్తూ  120 మంది నిందితులకు శిక్షలు పడేటట్లు చూడటం ప్రధానమైంది.  
నాకు,జావేద్ ఆనంద్ కు చెల్లించిన లావాదేవీలన్నీ 'ఫోర్డ్ ఫౌండేషన్', 'ఐక్య రాజ్య సమితి హింసా బాధితుల ఐచ్చిక నిధి'ల  బడ్జెట్ ప్రతిపాదనలకు,అంగీకారాలకు ఖచ్చితంగా లోబడే  వున్నాయి.  
సిజేపి, సబ్రంగ్ ట్రస్ట్లు తిరిగి చెల్లించిన మా వంతు ఖర్చులు ఆ ట్రస్టీలు వివిధ సందర్భాలలో ఆమోదించిన తీర్మానాలకు అనుగుణంగా వున్నాయి. జావేద్,నేనూ ఆ సమయాల్లో తీసికున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాము. 
మాకు చెల్లించిన పరిహారాల నుండి మాకు మేము ఖర్చు చేసికుంటున్నామన్న ఆరోపణ వ్యాఖ్యానించటానికే  తగనిది. 
సబ్రంగ్ ట్రస్ట్లు కళా ఖండాల వేలంద్వారా సమీకరించిన నిధులు ప్రారంభంలో చెప్పిన విధంగా మౌలిక కార్యక్రమాలు నిర్వహించటానికి ఉద్దేశింప బడ్డాయి. దీనికి వసూలు చేసిన నిధుల్ని బాధితులకు ఆర్ధిక సహాయంకోసం వినియోగిస్తామని ఎన్నడూచెప్పివుండ లేదు . మేము చేస్తున్న కృషిపై అత్యంత గౌరవం వున్నందున సుప్రసిద్ధ కళాకారులందరూ ఈ  ప్రయత్నాలకు ఉదారంగా  మద్దతునిచ్చారు. 
సిజేపి నిర్వహించిన న్యాయ సహాయ కృషికి లెక్కలు లేవన్న ఆరోపణను పరిశీలిస్తే, సిజేపి నిర్వహించిన న్యాయ సహాయ కృషి,అపూర్వ రీతిలో సాధించిన విజయాలు గుజరాత్ పోలీసులకు తప్ప దేశంలోనూ,విదేశాలలోని  ప్రతి ఒక్కరికి తెలుసు. సిజేపి వార్షిక ఖర్చుల్లో 80-90శాతం ఖర్చులు న్యాయ సహాయానికి, గుజరాత్ లో సిజేపి క్షేత్ర స్థాయి ఆఫీస్ కార్యకలాపాలకు సంబంధించి వున్నట్లు  ఇన్ కమ్ టాక్స్, చారిటి కమీషనర్, హొమ్ మంత్రిత్వ శాఖల అధికారులకు సమర్పించిన సిజేపి వార్షిక ఆడిట్ చేసిన అకౌంట్స్ తెలియ చేస్తున్నాయి. 
నిధుల సమీకరణ గురించి, ఫోర్డ్ ఫౌండేషన్ తో మీకుండే బాంధవ్యాన్ని వివరించగలరా ? 
స్పష్టంగా నిర్వచించుకున్న కార్యకలాపాల పొందిక ద్వారా కులం,మతతత్వం లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సబ్రంగ్ కమ్యునికేషన్స్, "కమ్యూనలిజం కంబాట్" అనే మాస పత్రిక ప్రచురణకు 2004,2006లలో ఫోర్డ్ ఫౌండేషన్ తో కన్సల్టేన్సిఒప్పందాన్ని కుదుర్చుకుంది.  కమ్యూనలిజం కంబాట్ పత్రికతో కాని, సంపాదక/ యాజమాన్య బాధ్యతల నిర్వహణకు జావేద్ ఆనంద్ కు,తీస్తా సేతల్వాడ్కు చెల్లించే పరిహారాలతో ఈ ఒప్పందానికి ఎటువంటి సంబంధం లేదు. న్యాయ నిపుణుల సలహా పొందిన తర్వాతే సబ్రంగ్ కమ్యూనికేషన్స్ కన్సల్టేన్సి ఒప్పదంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం  విదేశీ విరాళాల చట్టం సెక్షన్ 4 నుండి మినహాయింప బడటం వల్ల, దీని క్రింద  స్వీకరించే కన్సల్టేన్సి ఫీజు విరాళం క్రింద గాని, గ్రాంటు క్రింద కాని పరిగణింప బడకపోవటం మూలకంగా చట్ట ఉల్లంఘన క్రిందకు రాదు.
ఈ పరిణామాలు మీ సంస్థ కు, మీ కృషికి ఎంతటి నష్టాన్ని కలిగించాయి?
కొనసాగుతున్న ఒత్తిడి కాకుండా, ఈ పరిణామాలు మా విరాళాల దాతలను భయభ్రాంతుల్ని చేశాయి. అయినప్పటికీ మా మద్దతు దారులు పెరిగారు. పాలక వర్గం బహిరంగంగా మమ్మల్ని ఆహ్వానింప తగని వారుగా వర్గీకరిస్తే,అదొక సందేశాన్ని పంపింది. దాన్ని చాలామంది మౌనంగా స్వీకరించి, మాకు దూరంగా ఉంటున్నారు. దానర్ధం వాళ్ళు మమ్మల్ని ఏ మాత్రం నమ్మడంలేదని కాదు. వాళ్ళని వాళ్ళు రక్షించు కొంటున్నారు. 
లక్ష్యంగా చేయబడింది మీరు,జావేద్,మీ సంస్థే కాదు. గ్రీన్ పీస్, అణు వ్యతిరేక కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు కూడా పాలక  వర్గ  దాడులకు గురౌతున్నారు  
అది వాస్తవం. ఇతరులపై కంటే మాపై దాడులు తీవ్రమైనవైనా, ప్రజాతంత్ర నిరసనను నోరు నొక్కాలనే విస్తృత ధోరణి లో అదొక భాగంగా వుంది.  మతోన్మాదానికి, ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నవారిని ఒక ప్రక్క లక్ష్యం గా చేసికుంటుంన్నారు. మరో ప్రక్క ఫాసిస్ట్ తరహా అభివృద్ది నమూనాను, ప్రజా వనరులను అయినవారికి కట్టబెట్టే ధోరణులను ఎదుర్కొనే వారిని అమానుషంగా మట్టుబెడుతున్నారు. ఈ ఆగడాల్ని తీవ్రంగా ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైంది. 
సిబిఐ చర్యలు న్యాయ సాధనకు అవరోధంగా వున్నాయని మీరు మీడియా సమావేశంలో చెప్పారు. వివరించగలరా?
 మేము చట్టానికి అతీతులమని అనుకోము. కానీ సక్రమమైన  న్యాయ ప్రక్రియ కోసం ఒత్తిడి చేస్తాం. దుర్బుద్ధితో,దురుద్దేశ్య కరమైన దర్యాప్తులను ప్రశ్నించే హక్కును వుంచుకుంటూ మేము ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నాము. గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసిన ప్రధమ సమాచార నివేదిక లో ఆర్ధిక అవకతవకల్ని ఆరోపించారు. లిఖిత పూర్వకమైన సాక్ష్యాలను పరిశీలించి సిబిఐ చే దర్యాప్తు చేయించుకోవచ్చును. అటువంటప్పుడు పోలీస్ కస్టడిలోనే మమ్మల్ని విచారించాలని  వారు కోరటంలో అర్ధమేమిటి? 
మేము ఏ చట్టాలను ఉల్లంఘించ లేదు. మేమిక్కడ సహకరించేందుకే వున్నాము. మొట్టమొదట గుజరాత్ అధికారులు ,ఇప్పుడు కేంద్రం, హోం మంత్రిత్వ శాఖ,సిబి ఐ ల త్రయం మా వ్యక్తిగత స్వేచ్చ లను పరిరక్షిస్తున్నట్లు  మమ్మల్ని పనిలో వుంచుతూ  గత 20నెలలు గడిచి పొయినాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ఇచ్చిన'క్లీన్ చిట్'ను సవాలు చేసినందువల్ల, మేజిస్ట్రేట్ ఆమోదం పొందిన జకియా జఫ్రి రివిజన్ కేసు వాదనల సందర్భంగా గుజరాత్ హైకోర్టు లో నా ప్రమేయాన్ని, నా వ్యక్తిగత హాజరును అడ్డుకునేందుకే  ఇటివల సి బి ఐ మాపై చేసిన అసాధారణమైన దాడి ఉద్దేశ్యింప బడింది. సిబిఐ పంజరంలో చిలకల వ్యవహరిస్తున్నది. రోజువారీ విచారణల తో మమ్మల్ని కట్టి వేసి జాకియా జఫ్రి కేసులో మా కృషి ని నివారించేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. 
నిరాఘాటంగా జరిగే సాముహిక మతతత్వ నేరాలకుభారత దేశంలో శిక్షలు లేవని పెట్రేగుతున్న దుష్టసంస్కృతికి , భారత దేశ సుప్రీంకోర్టు నిరంతర పర్యవేక్షణలో, చట్టబద్ధ సంస్థల మద్దతుతో, సి జే పి సమిష్టి కృషితో వెన్ను విరువ బడింది. 1983 నెల్లి ఊచకోతలోగాని,1984 సిక్కుల మారణహోమంలో గాని, 1992-93 బొంబాయిహింస లో గాని మనం న్యాయాన్ని చూడకలిగామా? పటేల్ తెగకు సంబంధించిన  కొంత మంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో సహా 120 మంది ని శిక్షింప కలిగిన మా ప్రయత్నం చారిత్రకమైనది. ఈ విజయాలను మొరటుగా తలక్రిందులు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. 
జాకియా జఫ్రి కేసు తుది దశలో వున్నది. మీ పై జరిగిన దాడి సందర్భం కాకతాళీయమా?     
ఇది కాకతాళీయం కాదు. మేము మొట్టమొదట 2006లో ఫిర్యాదును దాఖలు చేసినప్పుడు జాకియా జఫ్రి పరిణామాలకు సాక్షిగా నిలిచి, దుశ్చర్యలకు నివ్వెర పోయిన ఒక మహిళ. గుల్బెర్గ్ ఊచకోత జరిగిన తర్వాత రాత్రంతా ఆమె పోలిస్ స్టేషన్ లోనే గడిపింది. 'అహమ్మదాబాదు కాల్తుంటే పోలీసులు సెలవులపై వున్నట్లుందని 'ఆమె నాతో అన్న మాటలు  నాకు గుర్తున్నాయి. జరిగిన దుశ్చర్యలు  ఉద్దేశ్యపూర్వకంగా బాహాటంగా చేసినవనే భావన ఆమె మనస్సులో నాటుకొనివుంది. క్రిమినల్ కేసు దాఖలు చేయటానికి ఆ భావన ఒక్కటే సరిపోదు. ఇప్పుడు ఆ దుశ్చర్యలను  ఋజువు చేయటానికి తిరుగులేని సాక్ష్యాలు కలిగి వున్నాము. 
మన దేశంలో గోధ్రా ఎక్కడైనా జరిగివుంటే, దానికి ప్రతీకారంగా మూడు,నాలుగు దాడులు నిస్సందేహంగా జరిగి వుండ వచ్చునని చెప్పగలను. కాని పాలన వ్యవస్థ నిర్వహించాల్సిన పాత్ర ఏమిటి? ప్రశాంతం గా,శాంతియుతంగా వుండమని, ప్రతీకారాలకు, రక్తపాతానికి పాల్పడ వద్దనే స్పష్టమైన అభ్యర్ధనలు ఏమైనా ఉన్నాయా? ఇదే మేము చెప్తుంది. దీనిచుట్టూనే మేము కేసును నిర్మించాము. 
ఈ వాదనలే ప్రజా క్షేత్రంలోకి తిరిగి  వస్తాయని మేము ఆశిస్తున్నాం.కాని అది పాలకులకు రుచించదు."మీరు పిలుచు కొనే "క్లీన్ చిట్" పై మీకంత విశ్వాసముంటే, గుజరాత్ హైకోర్టులో విచారణలో వున్న  క్రిమినల్ రివిజన్ అప్లికేషన్(205/2014) మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంద"ని మేము పాలక వర్గాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు అభద్రత గా వున్నారా?
న్యాయాన్వేషణ,కార్యశీలతలు బాహాటంగా  అణచివేతకు గురౌతున్నాయా? నిర్భయమైన కార్యశూరతకు మీరు ప్రతీకలౌతున్నారు. . 
అదే అనుకుంటుంటే, ఆ పిలుపును వినయంగా స్వీకరిస్తాను. న్యాయం కోసం పోరాడేశక్తులకు మేము చెప్పేదేమంటే, " మేము లొంగం". మన ప్రజాస్వామ్యాన్ని ఫాసిస్ట్ తరహా సిద్దాంత వశం కానివ్వమని పూరించే  శంఖారవమిది.  
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల కంటే భయానకంగా వున్నాయి. భారత రాజ్యాంగ  బద్ధ ప్రజాస్వామ్యాన్ని ఆశ్రిత కార్పోరేట్ సారధ్య హిందూ రాజ్యంగా మార్చాలన్న స్పష్టమైన అజెండా తయారయింది. పార్లమెంట్ లో 292 సీట్లున్నప్పటికి ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం విశిష్టమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి. భారత  రాజ్యాంగమే అంతింమంగా విశిష్టమైనది. సమానత,సుపరిపాలన తో కూడిన రాజ్యాంగ సూత్రాలకు ఎన్నికలతో ఒనగూడిన  అధికారం యొక్క ఆటవిక ప్రదర్శన ఎన్నడూ ప్రత్యామ్నాయం కాజాలదు. జాతీయంగా కేవలం 31శాతం ప్రజలే ఈ నియంతృత్వ పాలనా వ్యవస్థను సమర్దిస్తున్నారన్న వాస్తవాన్ని మనం నిరంతరం గమనంలో వుంచుకోవాలి.  
గత కొద్ది నెలల నుండి మీకు మద్దతు వెల్లువెత్తు తుంది. కొంత  కాలం పాటు మిమ్మల్ని ఎలక్రానిక్ మీడియా పట్టించుకోలేదు 
 వెల్లువెత్తుతున్న ప్రజా మద్దతుకు కృతజ్ఞులమై  వుంటాము. దీని ద్వారా  మా శక్తియుక్తులు పునరుజ్జీవనమౌతున్నాయి. అనేక ప్రజా సమూహాలు,సంఘాలు, రాజకీయ పార్టీలు మమ్మల్ని నికరంగా సమర్ధిస్తున్నాయి. మీడియా మమ్మల్ని భారీగా తోసేసింది. ఏక పక్షంగా నష్టం జరిగి పోయిన తర్వాతనైనా ప్రతిస్పందనలను ప్రచురిస్తూ పత్రికా రంగం కొద్ది మేరకు మెరుగ్గావున్నా, ఎలక్ట్రానిక్ మీడియా, పాలక వర్గ సారధ్యంలో కక్షసాధింపు వేటను కొనసాగించింది. ఆ పరిణామాల్ని వివరణాత్మకంగా అధ్యయనం చేయాలన్నా ఒళ్ళు గగుర్పొడుతుంది. సమతుల్యం లేని వార్తా ప్రసారాలు, ఋజువులు లేని ఆరోపణలు,  ఏక పక్ష కధనాలతో కార్పోరేట్ సారధ్య మీడియా  పాలక వర్గాలకిచ్చిన మూర్ఘమైన మద్దతుకు మేము బలిపశువుల మయ్యాం. 
మీరు న్యాయంకోసం పోరాడుతున్నా మన్నప్పుడు , దానర్ధం ఏమిటి?
మేము చేసేది వ్యక్తిగత పోరాటం కాదు, సామూహిక నేరాలకు జవాబుదారీతనం  కోరుతూ  చేస్తున్న పోరాటమిది. గోద్రా ఉదంతం జరిగిన మొదటి  72గంటలే కాకుండా వారాలు,నెలలపాటు రాజ్యంగా వ్యవస్థ కుప్పకూలి అధికారంలో వున్న ప్రభుత్వం చట్టపరంగా జవాబుదారీ అయి, 2002మే వరకు గుజరాత్ అట్టుడిగి పోతూ , కెపిఎస్ గిల్ ను మొదటి ఎన్డియేప్రభుత్వం  పంపేవరకు జరిగిన పరిణామాలు, ప్రజా న్యాయం కోసం జరిగిన పోరాటాలు కావా?
రాష్ట్ర నిఘా విభాగం తీవ్రమైన హెచ్చరికలు చేసినా, స్పందించని పొలీస్, పరిపాలన వ్యవస్థల వైఫల్యాలను , పోలిస్ కంట్రోల్ రూం, మద్దతు కోసం ఇచ్చిన సందేశాలను తిరస్కరించిన  సీనియర్ అధికారుల నిర్లక్ష్యాన్ని   ప్రశ్నించి నప్పుడు- ఇవన్నీ పౌరుల  ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం చేసే చట్టపరమైన చర్యలు కావా??  28.5. 2002 న మేము ఉపయోగించిన జాకియా జఫ్రి  దర్యాప్తు పత్రాలలో భాగమైన అహమ్మదాబాద్ పోలిస్ బ్రిగేడ్ ఇచ్చిన 47 సందేశాల్ని,  బాహాటంగా ఉద్దేశ్యపూర్వకంగా  త్రోసిపుచ్చినప్పుడు, తప్పొప్పులకు బాధ్యులైన పోలిస్ కమీషనర్ పి. సి.పాండే, అడిషనల్ పోలిస్ కమీషనర్ శివానంద్ ఝా ల వైఖరి మనకు ఏం చెప్తుంది? జవాబుదారితనం కోసం చేసే ఈ పోరాటాన్నివిరమించాలా??  మళ్ళీ ఎప్పుడూ చేయకూడదా ???
మీరు,మీ భర్త గడుపుతున్న కష్టతరమైన రోజులనుండి మ్మిమ్మల్ని,మీ భర్తని బయటపడి,రక్షణ పొందమని మీ శ్రేయోభిలాషులు మిమ్మల్ని ఎప్పుడైనా కోరారా? మీరలా చేస్తే ఏమవు తుందో ఆలోచించారా ?
ఇప్పటివరకు మా కాళ్ళ మీద మేమేనిలబడి, తీవ్రమైన వ్యక్తిగత నష్టానికి ఓర్చి  పోరాటం చేస్తున్నాము. మమ్మ్మల్ని నిలబెట్టిన ఈ స్థైర్యం  వీడదని  ఆశిస్తున్నాము.