యెమెన్ విషాదం సామ్రాజ్య వాదుల పాపం
విజయ్ ప్రసాద్
నెల రోజులు గడిస్తే, సౌదీ నాయకత్వంలో యెమెన్ పై బాంబుల దాడి జరిగి సంవత్సరమౌతుంది. దీని ద్వారా వ్యూహాత్మకంగా సాధించింది ఏమీ లేదు. 26మార్చి2015న సౌదీ బాంబుదాడి మొదలు పెట్టినప్పుడు వెన్ను విరిగిన యెమెన్ రాజకీయ చదరంగం ఎంతటి సంక్లిష్టతను ఎదుర్కోందో,ఇప్పుడూ అదే సంక్లిష్టతలో కొట్టు మిట్టాడుతున్నది.
సౌదీ దాని మిత్ర పక్షాలు యెమెన్ పై ఎందుకు బాంబుదాడి చేయాల్సి వచ్చింది? ఇంతటి తీవ్ర స్థితికి పురిగొల్పిన పరిస్థితులు ఏమిటి ? ఇంతవరకు తెలియరా లేదు. 2011లోని సంధికాలపు ఒప్పందం జగడానికి దారితీసింది. అధ్యక్షుడైన మంసౌర్ హదీ తాను 2015లో రాజీనామా చేసిన సంవత్సరం ముందు నుండే అతని మాట సాగడం లేదు. అనేక బృందాలు నూతన ఒప్పందం ద్వారా అధికారం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సానా(యెమెన్ రాజధాని) ముట్టడి అనివార్యం కాలేదు. ఇలా జరగటం ఎవర్నీ ఆశ్చర్య పరచలేదు. సౌదీ బాంబుల దాడి కొనసాగుతూనే వుంది.
సానాను ఎవరు స్వాధీనం చేసికొన్నారు? రెండు వైరి రాజకీయ పక్షాలు గా వున్న హౌతీలు మరియు అలీ అబ్దుల్లా సాలెహ్ నాయకత్వంలోని జనరల్ పీపుల్స్ కాంగ్రెస్ కలిసి హదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యెమెన్ రాజధాని అయిన సానా ను స్వాధీనం చేసికున్నాయి. 2004నుండి 2010వరకు అలీ అబ్దుల్లా సాలెహ్, హౌతీలకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. అయిన్నప్పటికి వాళ్లిద్దరు ఈ అంశంలో ఒకటైయ్యారు.
రాజధాని సానాను స్వాధీనం చేసికున్నప్పటికీ, సానా ఉత్తర భాగంలోని రేమట్ అల్ హుమయ్ద్ లో ఈ రెండు పక్షాల మధ్య ఘర్షణలు జరిగి, వారి మధ్య విభేదాలు బట్ట బయలైనాయి, వాళ్ళ అంతర్గత బలహీనత బయట పడింది. కొంత కాలం గడిస్తే, వాళ్ళమధ్య శత్రుత్వం మరింతగా తీవ్రమయ్యేటట్లుంది.
కాని ఈ పరిస్థితిని చేరకముందే సౌదీ దాని మిత్ర పక్షాలు జరిపిన బాంబు దాడుల ఫలితంగా వైరి పక్షాలుగా వున్నహౌతీలు,సాలెహ్ల ల మధ్య మైత్రి పటిష్టపడి, సౌదీ అరేబియా పై స్కడ్ క్షిపణులను ప్రయోగించే,అత్యంత నైపుణ్యంగల మిలిటరీ సిబ్బందిని వినియోగించుకోకలిగాయి. యెమెన్ విధ్వంస మైనప్పటికి,వాళిద్దరి మధ్య మైత్రి సౌదీ,దాని మిత్ర పక్షాల దాడిని నివారించగలిగాయి.
యెమెన్ యొక్క ఘోరమైన యుద్ధ విషాదాలలో దాని సంక్లిష్టమైన దేశీయ రాజకీయాలు ఒకటి. ఈ రాజకీయాలు ఇరాన్,సౌదీ అరేబియా ల మధ్య నెలకొన్న ప్రాంతీయ భౌగోళిక రాజకీయ స్పర్ధల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇరాన్ సాలెహ్ హౌతీలతో అంటీ అంటని సంబంధాలనే నిర్వహిస్తున్నది. ఉమ్మడి షియా సంబంధాలుగా పిలువబడే వారి మధ్య సంబంధాలు బలహీనంగా వున్నాయి. యెమెన్ కి చెందిన జైదీ షియా ఇరాన్ యొక్క 12 షియా ఇమాముల వారసత్వాన్ని,సిద్దాంతాన్ని అంగీకరించే వాడు కాదు.
ఇరాన్ పలుకుబడి పై సౌదీ అరేబియాకు వుండే అనుమానాస్పద ధోరణి ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తుంది సంయుక్త రాజ్యమా లేదా వేర్పాటువాదమా,ఉత్తరం/దక్షిణం,రిపబ్లికన్ లౌకిక వాదమా లేదా ముస్లిం రాజ్యమా లాంటి యెమెన్ ఇతర సమస్యలు మరుగున పడ్డాయి. కొనసాగుతున్న ఘర్షణలో సౌదీ అరేబియా జోక్యం పరిస్థితుల్ని సంక్లిష్టపరిచి, శాంతి సామరస్య భావనను దాదాపు అసాధ్యం చేసింది.
సౌదీయులు సాలెహ్,హైతీయుల్ని బలహీన పరచాలనుకుంటే తమవేగుల విభాగం ద్వారా ఆ రెండు పక్షాల మధ్యనున్న అంతరంగిక విభేదాల గుట్టును చేజిక్కించుకోవాల్సి వుండేది. వాళ్ళను వేరుచేసి విడదీయటమే సౌదీయుల ముందున్న చక్కటి సున్నితమైన మార్గం. కాని మార్చి 26 నుండి మొదలైన బాంబుల వర్షం సాలెహ్,హైతీయుల్ని ఏకం చేసింది. సౌదీయులు ఎందుకు ఇలా చేస్తున్నారు ? వాళ్ళు వ్యూహాత్మకంగా ఆలోచించటం లేదా?? పోనీ ఇరాన్ మీద వాళ్ళకుండే ద్వేషంతో ఇలా చేస్తున్నారా?? సౌదీ అరేబియాలోని స్థానిక సమస్యలు వాళ్ళను యుద్ధం వైపు మళ్ళిస్తున్నాయా ?? వాళ్ళ అంతరంగం అంతు చిక్కటం లేదు.
యుద్ధానికి ముందే సల్మాన్ రాజు సింహాసనాన్ని అధిరోహించి,తన కొడుకైన మొహమ్మద్ బిన్ సల్మాన్ ను రక్షణ మంత్రిగా నియమించాడు. మొహమ్మద్ బిన్ సల్మాన్ ను స్థానికంగా ఎం బి ఎస్ గా పిలుస్తారు. బాంబింగ్ మొదలైన తర్వాత రోజున ఎం బి ఎస్ మిలిటరీ నిర్వహణ కార్యాలయంలో మ్యాపులను పరిశీలిస్తూ, పైలట్లతో ఫోనులో మాట్లాడుడతూ టెలివిజన్ లో కనిపించారు. ఆయన రక్షణ మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వాస్తవంగా కనపడటానికికే యెమెన్ యుద్ధం ఒక అవకాశంగా వచ్చినట్లుంది. కాని అది ఇప్పుడు అతని మెడకు ఉచ్చులా తయారైంది. యుద్ధాన్ని గెలవకుండా సౌదీ అరేబియా యుద్ధాన్ని విరమించలేదు. దాని రాచరికపు చట్టబద్ధత యుద్ధంలో ఫలితం పై ఆధారపడి ఉంది. . దాని ప్రేరేపణలకు యెమెన్ బలి అయింది.
యెమెన్ అంతర్జాతీయ క్రైసిస్ గ్రూప్ తన నూతన నివేదికలో, “శాంతి సాధ్యమా” అని శాంతి పై ఒక సముచితమైన ప్రశ్న వేస్తూనే, లోతైన అననుకూల అంచనాన్ని అందిస్తున్నది. స్థానిక,ప్రాంతీయ పరిణామాలు శాంతి కి అనుకూలంగా లేవని ఆ బృంద రచన కర్తలు వ్రాస్తున్నారు. రియాద్,తెహ్రాన్ల మధ్య సంబంధాలు సన్నగిల్లు తున్న కొద్దీ, ప్రాంతీయ సమస్యలకు పరిష్కారాలు మృగ్య మౌతున్నాయి. దేశంలో కూడా వివిధ పార్టీల మధ్య విశ్వాసం దెబ్బతింది. విచ్చిన్నవాద ధోరణి ఇప్పుడు ప్రబలంగా ఉంది.
1990లోని యెమెన్ ఐక్యత ముక్కలయ్యేటంతగా ప్రమాదంలో పడింది. టైజ్ నగరం ఇద్దరి స్వాధీనంలో వుండి,రెండు శక్తులూ పాతసరిహద్దు దగ్గర కూర్చోటానికే పరిమిత మయ్యాయి. దక్షిణ ప్రతిఘటన, హౌతీల సాయుధ బలగాలు ముక్కలుగావున్న యెమెన్ రక్షణదళమంత ప్రాధాన్యతను పొందాయి “ చారిత్రకంగా హింసకు విచ్చినవాదం చోదక శక్తి కాకపోయినప్పటికి బహుళ ప్రచారంలో వుంద”ని కాన్ ఫ్లిక్ట్ గ్రూప్ వ్రాస్తున్నది. గతం నుండి కొనసాగుతున్న పగసాధింపు సమస్యలు విపరీతంగా పెరిగాయి. తెగల ప్రాతిపదికన పేట్రేగుతున్న కక్షలు ఘర్షణలను సజీవంగా నిలబెట్టుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి ప్రక్కకు నెట్టి వేయబడింది. దానికి ఇక్కడి సమస్యలు సిరియా సమస్యలతో సమానంగా వున్నాయి. భౌగోళిక రాజకీయ ఘర్షణలు, తుపాకి ఆధిపత్యం కారణంగా క్షేత్రస్థాయిలో ఐక్య రాజ్య సమితి ఆద్వర్యంలో చర్చలతో సమస్యను పరిష్కరించుకునే వాతావరణం కానరావడం లేదు.క్రైసిస్ గ్రూప్ తన నివేదికలో గణనీయంగా వుండే పశ్చిమ దేశాల పాత్రనుఈ వ్యవహారాల్లో తక్కువగా చూపింది. ఘర్షణలో తటస్థ పరిశీలకుల పాత్రను నిర్వహించకుండా పశ్చిమ దేశాలు సౌదీలకు ఆయుధాలను అందిస్తూ వారిపక్షాన చేరాయి. షీలా కార్పికో సంపాదకీయంలో రాబోతున్న పుస్తకంలో యెమెన్ వ్యవహారంలో పశ్చిమ దేశాల పాత్రను వివరించటం జరిగింది. యుద్ధానికి పశ్చిమ దేశాల మద్దతు సౌదీల అత్యాశను పెంచుతూ, అమెరికా ఆకాంక్షలను బలహీనపరుస్తుంది.
దైవ ప్రచారకుని రధం యెమెన్ చేరింది. దాని రెండు అశ్వాలలో ఒకటి యెమెన్ ను గడగడలాడిస్తున్న కటిక క్షామం. యెమెన్ లో క్షీణిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలతో ఐక్య రాజ్య సమితి ఏజెన్సీలు తీవ్రంగా ఆందోళన పడుతున్నాయి. ఆ దేశంలో లో సగభాగం క్షామం తో తల్లడిల్లుతుందని ప్రపంచ ఆహార కార్యక్రమం నెల రోజుల క్రితం ప్రకటించింది. 2కోట్ల 30లక్షల యెమెన్ దేశీయులలో కోటీ 40లక్షల మంది ఆహార రక్షణ కోల్పోయారని యెమెన్ లోని యూనిసెఫ్ ప్రతినిది జులిఎన్ హార్నీస్ వెల్లడించారు. దాదాపు 10లక్షలమంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 5సంవత్సరాల లోపువున్న 10లక్షల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహారలేమిని అనుభవిస్తూ,శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 20లక్షల పిల్లలు స్కూళ్ళకు వెళ్ళ లేకున్నారు. ఈ ఘర్షణలకు పూర్వమే మధ్య ప్రాచ్యంలో కడు పేద దేశంగా వున్న యెమెన్ పై ఈ యుద్ధం యొక్క దీర్ఘకాలిక పర్యవసానాలు ఎంత తీవ్రంగా వుంటాయో ఎవరైనా వూహించ వచ్చునని హార్నీస్ అంటున్నారు.
దైవ ప్రచారకుని రెండవ అశ్వం అతివాదం.క్రైసిస్ గ్రూప్ అభిప్రాయం ప్రకారం యుద్ధం వల్ల అరేబియా ద్వీపకల్పపు ఆల్ ఖైదా, ఇస్లామిక్ రాజ్య బృందం ప్రముఖంగా ప్రయోజనం పొందాయి. అరేబియా ద్వీపకల్పపు అల్ ఖైదా హద్రమౌంట్ ప్రాంతంలోని ముకల్లా లాంటి నగరాలపై పూర్తీ పట్టుకలిగి , ఈ యుద్ధంలో టైజ్ నగరంలోని దక్షిణ ప్రతిఘటన తదితర ప్రాంతాలలో చాలా చురుకుగా వుంది. అది సౌదీ విమాన స్థావరాల్ని గుర్తించి,దాని మూలంగా అనేక ప్రయోజనాలను పొంద కలిగింది.
ఈ మధ్యలో అరేబియా ద్వీపకల్పపు ఆల్ ఖైదా నుండి ఇస్లామిక్ రాజ్య బృందం పేర, ఒక చీలిక పక్షం బయటకు వచ్చింది. సానా నగరం నందలి జయ్ది మసీదు దగ్గరలో 140మందిని చంప గలిగిన సామూహిక దాడితో అది తన స్థాపనను 20. 3.2015న ప్రకటించింది.
.
“మధ్య ప్రాచ్య ప్రకంపనలలో,యెమెన్ యుద్ధ తీవ్రత సాపేక్షంగా గా గుర్తింపబడలేదు.కాని 2800 మందికి పైబడి, సామాన్య పౌరులు ఈ యుద్ధంలో మరణించారు. వీరిలొ అత్యధిక భాగం విమాన దాడులలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వినాశకరమైన క్షామంతో ఆ దేశం మానవత సంక్షోభం తో కూనరిల్లుతుంది, శరణార్ధుల సమూహాలు ఆ ప్రాంతాన్నిమరింతగా అతలాకుతలం చేస్తున్నాయి. “అని క్రైసిస్ గ్రూప్ భావిస్తుంది.
ఇది సముచిత మైన అంచనా. ఈ అంచనా ఎవరినన్నా మేలుకోలుపుతుందా ? అలా జరగాల్సిన అవసరం లేదు. సౌదీ అరేబియా మిత్ర పక్షమైన యునైటెడ్ ఆరబ్ ఎమెరిటస్, “ఒహోల్ అల్-రౌమి” ని తన మొదటి “అనందం” మంత్రి(మినిస్టర్ ఫర్ హపీనెస్స్)గా నియమించింది. పొరుగు దేశమైన యెమెన్ లో విషాదం తాండవిస్తుంటే, ప్రక్క దేశంలో అటువంటి మంత్రి నియామకం ఇబ్బందిగానే వుంది. బహుశా! దుబాయ్,షార్జా లాంటి భూతల స్వర్గాల లోని మాల్స్ లలో, సానా, టైజ్ నగరాలలోని భవంతులలో బాంబుల దాడితో క్షణ క్షణం భయకంపితులౌతున్న చిన్నారులకు ఆనందం కలిగించడం కోసమన్నా ఈ నూతన మంత్రి కృషి చేస్తాడేమో చూద్దాం.
అనువాదం: కొండముది లక్ష్మీ ప్రసాద్
No comments:
Post a Comment