Saturday, October 31, 2015

రూపాయిని కదిలించే దెవరు?
లోకేశ్వరి ఎస్ కె   
విదేశీ మదుపుదారు’లని వెంటనే మీరనవచ్చు. “వాణిజ్య సమతుల్యత” రూపాయిని అంతకు మించి ప్రభావితం చేస్తుంది.  
ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రూపాయి విలువ  ప్రతి వారిని ఉత్కంటకు గురిచేసింది. ఆగస్టు 2013 లో అతి కనిష్టం గా వున్న డాలరుకు రూపాయి విలువ  68 రూపాయలకు జారి పోతుందోనన్న అందోళనను కల్గిస్తూ, పతనం 67రూపాయిల దగ్గర పతనం  ఆగింది. .
పై రెండు సందర్భాలలో పైకి మాత్రం  ప్రపంచవ్యాప్త ఆర్ధిక వ్యవస్థలలొని ఇబ్బందుల వల్ల ఈదుస్థితి ఏర్పడిందనిపిస్తుంది.  అమెరికా ఫెడరల్ రిజర్వు తన పరిమాణాత్మక సడలింపు కార్యక్రమంలో భాగంగా  వడ్డీ రేటును పెంచుతానని 2013నుండి చేస్తున్న బెదిరింపు అందులో ఒకటి. దీనికి తోడు చైనా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రపంచవ్యాప్త ఆర్ధిక మందగమనం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
అంతర్జాతీయ మదుపుదారులు ప్రపంచవ్యాప్త పరిణామాలకు అనుగుణంగా మార్కెట్లో అంతర్జాతీయ రాగాలతో తమ పెట్టుబడుల క్రీడలో  రూపాయిని నర్తింపచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాని వాస్తవంలో అది సరి కాదు. రూపాయి చలనానికి,విదేశీ పెట్టుబడుల మధ్య వున్న సంబంధాన్ని విశ్లేషిస్తే, రూపాయివిలువను దీర్ఘకాలికంగా ప్రభావితం చేయటంలో విదేశీ పెట్టుబడులకు  దీర్ఘకాలిక పాత్ర లేదని బోధపడుతుంది. వాస్తవంలో రూపాయివిలువపై చమురుదిగుమతి ధరల్లో హెచ్చుతగ్గులు, ఎగుమతులవృద్ది లాంటి వాణిజ్య సమతుల్యత కు సంబంధించిన  అంశాలు  అత్యధిక ప్రభావాన్ని కలిగిస్తాయి.
రూపాయి, విదేశీ పెట్టుబడులు
రూపాయివిలువ, సెన్సెక్స్ ల భవితవ్యాన్ని నిర్ణయించేది విదేశీ పెట్టుబడులని కూడా గట్టిగా నమ్ముతుంటారు. కాని ఇది నిజం కాదు. స్వల్పకాలికంగా కరెన్సీ మార్కెట్ సెంటిమెంటు పై విదేశీ నిధుల ప్రభావం వున్నా, వాటిపై దీర్ఘకాలిక ప్రభావం వుండదు. విదేశీ మదు పుదారులైన విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి దారులు, ప్రవాస భారతీయులు గత 5 సంవత్సరాలుగా మన దేశంలోకి గణనీయమైన విదేశీ నిధుల్ని చొప్పిస్తున్నారు. కాని వీటన్నింటి ప్రభావంతో రూపాయి దక్షిణం దిక్కుకే నడుస్తున్నది. 2009 నుండి అనేక సంవత్సరాలలో విదేశీ నిధుల ప్రవేశం భారీగా వుంది. దీని కారణంగా సెన్సెక్స్ భారీగా విజ్రుంభించింది కాని, ఈ కాలంలో రూపాయి విలువ పడి పోయింది.
2014 సంవత్సరంలో మనదేశం అత్యధికంగా విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడుల క్రింద రూ4200కోట్ల డాలర్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల క్రింద రూ3400కోట్ల డాలర్లు, ప్రవాస భారతీయుల బ్యాంకు డిపాజిట్ల ద్వారా రూ1100కోట్ల డాలర్ల నిధుల్ని పొంద కలిగింది. సెన్సెక్స్ అత్యధిక స్థాయికి ఎగబ్రాకి, గత సంవత్సరం కంటే 29శాతం వృద్దిని సాధించింది. కాని రూపాయి దాని విదేశీ మారక విలువలో 2.7 శాతం విలువను కోల్పోయింది. 2009 సంవత్సరంలో 1800కోట్ల డాలర్ల విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడులు భారత ఈక్విటీ షేర్ ధరలను అతి తక్కువ స్థాయి నుండి పైకి పెంచ కలిగితే,రూపాయి దాని  విలువలో 4శాతానికి మించి పెరగలేదు.       .    
2014లో రూపాయి విదేశీ మారక విలవకు, సెన్సెక్స్ కు మధ్య వున్న సంబంధం +0.01 కాగా,అది 2013లో నెగటివ్ విలువకు దిగజారింది. సెన్సెక్స్,రూపాయి విలువలు రెండూ  పరస్పర ఆధారితాలు కావాని మనం గమనించాలి. విదేశీ నిధులు,రూపాయి విలువల మధ్య వున్న బంధం చాలా బలహీనమైంది.
విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడులకు, రూపాయికి మధ్య వున్న సహ సంబంధం 2014, 2013 లలో 0.5 కంటే తక్కువగానే వుంది. దీనర్ధం- భారత దేశం తన ఆర్ధిక వృద్ది, ఆకర్షణీయమైన నిజ వడ్డీ రేట్ల మూలకంగా విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడులకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రీతికరమైన గమ్యస్థలంగా  మనగలుగుతున్నది కాని, ఇవేమీ రూపాయివిలువను పెంచేందుకు  దోహదపడటం లేదు. .  
రూపాయి,వాణిజ్య లోటు
అందువల్ల రూపాయి విలువకుకి వచ్చే రోగాలన్నింటిని విదేశీ పెట్టుబడులే నయం చేస్తాయని భావించరాదు. మనం 50సంవత్సరాల రూపాయి చరిత్రను పరిశీలిస్తే అది వ్యవస్థీకృతంగా పతనధోరణిలోవుండి, నికరంగా తక్కువ స్థాయి లోనే కొనసాగు తున్నది.  1973లో 7. రూపాయలకు అమెరికన్ డాలరు ను కొనకలిగేవారం. ఆ రోజుల్లో మార్కెట్లోని గిరాకి సరఫరా లకు అనుగుణంగా రూపాయివిలువను మారనిచ్చే వాళ్ళు కాదు . 90లలో భారత ఆర్ధిక వ్యవస్థను బాహ్య ప్రపంచానికి తలుపులు తెరిచినప్పటి నుండి రూపాయి విలువ భారీ పతనానికి లోనైంది. భారత దేశం యొక్క  వాణిజ్య లోటు నికరంగా కొనసాగటమే, రూపాయివిలువ యొక్క వ్యవస్థీకృత బలహీనతకు ప్రధాన కారణమైంది. వాణిజ్య లోటు లోని మూడు పార్శ్వాలు  రూపాయి విలువలో కదలికను ప్రభావితం చేస్తున్నాయి. అవి 1.చమురు ధరలు  2.బంగారం దిగుమతులు 3. భారీగా పెరుగుతున్న నికర దిగుమతులు.
1. అందులో చమురు ధరలలో మార్పు  గురించి ముందుగా చెప్పుకోవాలి. మన దిగుమతులలో చమురు మూడవ వంతును ఆక్రమిస్తుంది. దీనికి తోడు మనదేశంలో చమురు గిరాకి నికరంగా తగ్గక పోవటం, చమురు ధరలలో భారీగా ఏర్పడుతున్న హెచ్చుతగ్గులు రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
2008-09లో ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరిగిన కారణంగా చమురు దిగుమతుల విలువ 17శాతం పెరిగిన కారణంగా రూపాయి విలువ భారీ పతనాలల్లో ఒక రికార్డ్ ను  నమోదుచేసింది. 2011-12 లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 46 శాతం పెరిగినప్పుడు, రూపాయి విలువ 6.4 శాతం పతనమైంది. మరోప్రక్క 2013-14నుండి చమురు ధరల్లో సవరణల కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినందువల్ల రూపాయి విలువలో పతనం కట్టడిచేయబడింది. పెట్రోలియం,వాటి ఉత్పత్తుల ధరలు 2009లో 93 డాలర్ల నుండి ఇటీవలి 2015 లో 138 డాలర్లకు పెరిగి, రూపాయివిలువ పై మళ్ళీ వత్తిడిని పెంచినాయి.
2. మనదేశ విదేశీ వాణిజ్యంలో బంగారం ధరలు రూపాయి విలువను ప్రభావితం చేయకలుగుతాయి. 2008 సంక్షోభం ఫలితంగా బ్యాంకు డిపాజిట్లు మరియు స్థిర ఆదాయ మదుపులపై  పై తిరోగమన   ఆదాయాలు  రావడంతో, భారతీయులు తమ మదుపును బంగారం లాంటి భౌతిక ఆస్తులల్లో పెట్టుబడులు పెట్టడం మొదలెట్టారు. దీని ఫలితంగా భారతదేశ బంగారం దిగుమతులు 2008-09 లో 2100కోట్ల డాలర్ల నుండి 2012-13లో 5700కోట్ల డాలర్లకు పెరిగాయి. ఈ కాలంలో అత్యధికంగా పెరిగిన  బంగారంరేట్లు దిగుమతుల విలువలను పెంచేశాయి.
2013 కరెన్సీ సంక్షోభం రగలటానికిగల 2012లో 5600 కోట్లకు తీవ్రంగా పెరిగిన బంగారం దిగుమతులు, భారీగా పతనమైన రూపాయి విలువ లు కూడా దోహదపడ్డాయి. పెట్రోల్ కంటే బంగారం వినియోగాన్ని కట్టడి చేయటం తేలికైనందున, 2013లో ప్రభుత్వం బంగారం దిగుమతుల నియంత్రణకు సత్వరం పూనుకోకలిగింది. మళ్ళీ బంగారం దిగుమతుల పై ఆంక్షలు సడలించటంతో,మళ్ళీ బంగారం దిగుమతులు ఊపందుకుంటున్నాయి.
3. ఆర్ధిక సంస్కరణల తొలి సంవత్సరాలలో పెరుగుతున్న దిగుమతుల్ని,ఎగుమతులు కొంతమేరకు సర్దుబాటు చేయకలిగేవి. ఎగుమతుల వృద్ది మందగించటంతో ఈ మధ్య కాలంలో ఇది సాధ్యం కావటం లేదు. వాణిజ్య ఎగుమతుల వృద్ది 2010-11లో వున్న 40శాతం నుండి పడిపోతూనే వుంది. 2015-16లో ఇప్పటివరకు వాణిజ్య ఎగుమతుల విలువ కుంచించుకు పోతున్నది. సర్విస్ రంగంలోని ఎగుమతులు కూడా ఇదే ధోరణిలో వుండి గత 3 సంవత్సరాల మందగమనం తర్వాత 2015-16లలోమరింత  కుంచించుకు పోతున్నాయి. చమురు,బంగారం ధరల్లో కొంత ఉపశమనం వున్నా, గత రెండు సంవత్సరాలుగా రూపాయి విలువ నత్త నడక నడుస్తునేవుంది . విధాన కర్తలు,’భారత్ లో తయారి ‘ప్రచారకులకు  ఈ పరిణామాల పర్యవసానాల ప్రభావం  తీవ్రంగా వుంటుంది. .
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో  కొనసాగుతున్న మందగమన ప్రభావం మన ఎగుమతుల వృద్ది పై తీవ్రంగా వున్నది. భారత  దేశం యొక్క వాణిజ్య ఎగుమతుల్ని పెంచేందుకు ఎంతో చేయాల్సి వుంది.
చమురు,బంగారం ధరలను నియంత్రించ కలిగే అవకాశం వున్నప్పుడు,రూపాయికి కొంత ఉపశమనం వుంటుంది. ఎగుమతుల వేగం తగ్గటం రూపాయి కి బలహీనత గానే భావించాలి. ద్రవ్యోల్బణ దీర్ఘకాలిక చలనం రూపాయి విలువపై ప్రభావాన్ని కలిగి వుంటుంది.టోకు ధరల సూచీ రెండు సంవత్సరాల క్రితం వరకు ప్రభావాన్ని కల్గిస్తునే వుంది. ఈ సూచికి సంబంధించి అనేక సంవత్సరాల సమాచారాన్ని కలిగి ఉన్నాము.టోకు ధరల సూచీ ప్రాతిపదికన ద్రవ్యొల్బణం లో పెరుగుదల  90లలో 20శాతం వద్ద వున్నా, తదనంతర కాలంలో అంతకంటే తక్కువ స్థాయిలోనే  నిర్వహింపబడుతున్నది. 2008,2010లలో సూచీ 19శాతాన్ని తాకినా,అప్పటి నుండి తక్కువ స్థాయిలో వుంటూ,ఒక దశలో ‘0.’కి పతనమై, 2015 లో ప్రతి ద్రవ్యోల్బణ దిశకు చేరేటట్లుంది.అత్యధిక ద్రవ్యోల్బణం కరెన్సీ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుంది. రూపాయిని పటిష్టపరిచే అంశాలలో పతనమవుతున్న ద్రవ్యోల్బణ మొకటి.కరెన్సీ వాణిజ్య పోటీలో ద్రవ్యోల్బణ పతనం రూపాయి విలువను పెంచింది. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి, విదేశీ కరెన్సీ తో పోల్చి కొలిచే రూపాయి విలువను ‘వాస్తవంగా ప్రభావితమయిన విదేశీ మారక రేటు(రియల్ ఎఫెక్టివ్ ఎక్ష్చెంజ్ రేటు)’అంటాము. దీన్ని రిజర్వ్ బ్యాంకు నిర్ణయిస్తుంది. సెప్టెంబర్ ఆఖరుకు దీని విలువ 110. ప్రస్తుతానికి  10శాతం రూపాయి విలువ పెరిగిందని దీనర్ధం. కాని వాస్తవంగా’ ప్రభావితమయిన విదేశీ మారక రేటు(రియల్ ఎఫెక్టివ్ ఎక్ష్చెంజ్ రేటు)ను, రూపాయి పోటితత్వాన్ని టోకు ధరల సూచీ ప్రాతిపదికన కొలుస్తారు. అందువల్ల దీన్నిప్రామాణికమైన  కొలమానం గా పరిగణించ లేము.  
డాలర్ బంధం
రూపాయి విలువ కదలికల్ని నిర్దేశించే అంశాలలో డాలర్ పటిష్టత మరొక ముఖ్యమైన అంశం. రూపాయి విలువకు సంబందించిన ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే జూలై 2011 నుండి రూపాయి విలువలో తీవ్రమైన తాజా తరుగుదల మొదలైంది. ఈ తరుగుదల, ఎస్ అండ్ పి రేటింగ్ సంస్థ  అమెరికా క్రెడిట్ రేటింగ్ ను ఎఎఎ కంటే దిగువకు తగ్గించి, డాలర్ సూచీ  73 కు పతనమైన సమయంలో సంభవించింది. యూరోజోన్  సభ్యులు బలహీన పడటం వల్ల యూరో బలహీనంగా ఉండటం, అమెరికా ఆర్ధిక వ్యవస్థ వృద్ది లో మెరుగుదల సాధించటంతో డాలర్ మళ్ళీ పుంజుకుంది.అమెరికాలోని  ‘దాదాపు సున్న ‘వడ్డీ రేటు డాలర్ రుణాలకు గిరికీని పెంచింది. ఫలితంగాఅమెరికా మదుపు దారులు  ఇతర దేశాలలో ఆస్తులు కొనడం మొదలెట్టారు ఆగస్టు 2011 తొలినాళ్ళలో డాలర్ సూచీ 30శాతం పుంజుకోగా, ఈ సమయంలో డాలరుకు రూపాయి విలువ  44నుండి 65శాతం వరకు పోగొట్టుకుంది. డాలర్ విలువ పుంజుకోవటం,రూపాయి విలువ తరుగుదలను ప్రభావితం చేస్తుంది.
ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను పెంచటం మొదలెట్టితే డాలర్ అత్యధిక విలువను పొందటం వల్ల రూపాయి మరింతగా విలువను పోగ్గొట్టుకునే ప్రమాదం వుంది
విదేశీ పెట్టుబడుల దిశ నిర్దేశం లో రూపాయి చలనాన్ని అంచనా వేయటం వృధా ప్రయాస. ఈ పరిణామాల దృష్ట్యా ఆస్తుల ధరల్లో తాత్కాలిక ఒడుదుడుకు లున్నప్పటికీ, కరెన్సీ విలువలు ప్రధానంగా విదేశీ వాణిజ్య గణాంకాల పై, ప్రధాన సరుకుల దిగుమతులపై  అత్యధికంగా ప్రభావిత మౌతుంటాయి.
చమురు ఉత్పత్తి దిగ్గజాలు రకరకాల ఎజెండాలతో వున్నకారణంగా కొంత కాలంపాటు చమురు ధరలు మందంగానే వుండవచ్చు. దీనివల్ల రూపాయి కొంత ఉపశమనం పొందాలి. ఈ సంవత్సరంలో తట్టుకోగలిగిన కరెన్సీలలో రూపాయి ఒకటిగా వుంది. చమురు ధరల పతనం వల్ల పొందిన ప్రయోజనంతోనే ఇది సాధ్యమైంది. ఈ కాలంలో బంగారం యొక్క గిరాకి కూడా తగ్గింది. భారత దేశంలో నగలబంగారం గిరాకి పై నిరంతర నిఘా ఉంచాల్సినప్పటికి, బంగారం ధరలు పెరిగే అవకాశాలు అంతగా లేవు. అదుపులో వున్న ద్రవ్యోల్బణం రూపాయికి అనుకూలంగా వుండి ,దాన్ని పటిష్ట పరుస్తుంది కాని, కొనసాగుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగమనం వల్ల ప్రభావితమయ్యే మన ఎగుమతులు  ప్రస్తుతానికి రూపాయికి ఇబ్బంది కరంగానే వుంటాయి.
అంతర్జాతీయ వాణిజ్యం లో మనం మనలేని పరిస్థితులు ఏర్పడి, అమెరికా ఫెడరల్ రిజర్వు  వడ్డీ రేటు పెంపు ప్రతిపాదనలు అమలైతే , దేశంలోని విదేశీ పెట్టుబడులు భద్రమైన అమెరికన్ డాలరు తో అనుసంధానమైన ఆస్తులకు భారీగా మళ్ళినప్పుడు  రూపాయి ఎదుర్కొనే ఇబ్బందుల్ని సర్దుబాటు చేసికోవటం పెద్ద సవాలుగా వుంటుంది. . అటువంటి స్థితిలో డాలరుకు రూపాయి విలువ  72- 75 కు పడిపోయే ప్రమాదముంది. అదృష్ట వశాత్తు ఇది సంభవించక పోతే, వచ్చే సంవత్సరంలో డాలరుకు రూపాయి విలువ 60-70 మధ్య వుండవచ్చు .  
  (బిజినెస్ లైన్ 18,10.2015 సంచిక నుండి స్వీకరణ)

స్వేచ్చానువాదం :కొండముది లక్ష్మీప్రసాద్  

Tuesday, October 20, 2015

మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటన-
 ప్రచార హోరు కోసం డిజిటల్ వలసవాదానికి ఆహ్వానం 

ప్రబీర్ పురకాయస్థ 

అమెరికా  హైటెక్ ఐటీ పరిశ్రమ కు జన్మస్థలమైన సిలికాన్ వ్యాలీని ఇటీవల సందర్శించినప్పుడు, లాస్ఏంజెల్స్ నందలి శాప్  సెంటర్లో మోడీ  తన స్వంత ట్రేడ్ మార్క్ కల్గిన  హావభావ ప్రదర్శనను అందించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా కంపెనీల సియీఒ ల సమావేశాన్ని, ఫేస్ బుక్ సంస్థాపక అధినేత మార్క్ జుకర్బెర్గ్ టౌన్ హాల్ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ఈ ప్రదర్శన తో ఆయన జతచేశారు. అభాసు పాలైన ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ నమూనాకు  కొత్తరూపమిస్తూ ఫేస్ బుక్  డిజిటల్ ఇండియా కు మద్దతు  క్యాంపెయిన్ సృష్టించటం, భారతదేశంలో గ్రామాలను బ్రాడ్ బ్యాండ్ తో  అనుసంధానిస్తామని మైక్రోసాఫ్ట్  ముందుకు రావటం, 500ల భారత రైల్వే స్టేషన్లలో వైఫై సేవల నందిస్తామని గూగుల్ వాగ్దానం చేయటం' మోడీ పర్యటన మహత్తర విజయాలుగా  భారతదేశంలో వార్తాపత్రికలు మొదటి పేజి హెడ్ లైన్స్ పెట్టాయి. కాని భారతదేశ  డిజిటల్ మార్కెట్ ను హస్తగతం చేసికోవాలనే  ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్,గూగుల్ లాంటి సంస్థల ఆకాంక్షల నంగీకరిస్తూ ఈ పర్యటన సందర్భంగా  మోడీ వేసిన రాజముద్రను ఈ ప్రచార హోరు మరుగున  పెట్టింది.

భారత దేశానికి బ్రిటిష్ వాళ్ళు రాగానే,ఇక్కడి రాజులు,నవాబులు ఎంతో ఉత్తేజితులైనారన్న  వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. ధన సంపాదనకు రెడీమేడ్ వనరు దొరికిందని వారు భావించారు. వాళ్ళ విలాసవంతజీవితంకోసం, క్షీణిస్తున్న జీవన విదానంమార్పు కోసం వాళ్లకు అప్పులివ్వటానికి బ్రిటిష్ వర్తకులు, ఈస్టిండియా  కంపెనీ  స్థానికులతో పోటీ  పడ్డారు.కంపెనీ నుండి తీసికున్న అప్పుల్ని తిరిగి కట్టాల్సిన అవసరంలేదని బహుశా వాళ్ళు భావించి వుంటారు.కాని అంతిమంగా  వాళ్ళ జీవితాలతో పాటు భారత  దేశాన్నే బ్రిటిష్ వాళ్ళకు అప్పగించాల్సి వచ్చింది.

బ్రిటిష్ వాళ్ళు మహా సాగరాలనే అదుపు చేయగలిగి యున్నందున,  రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించకలిగారు.ఈ రోజుల్లో డిజిటల్ మహా సాగారాల్ని నియంత్రించ కల్గిన వాళ్ళు ప్రపంచాన్నే శాసించగలరు. కొద్ది గంటల పాటు కొనసాగే భారతదేశ మీడియాలో 'వైభవం' కోసం గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ లాంటి అమెరికా బహుళజాతి సంస్థలకు మోడీ అందిస్తున్న  బహుమానమిదే.
ఇది ఇంతటితో ఆగలేదు. గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ మరియు ఇతర టెలికం కంపెనీలు నేషనల్ సెక్యురిటి ఏజెన్సీ లోను, పంచ నేత్రాల (యుఎస్,యుకె, కెనడా,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్) ప్రపంచ నిఘా సమాహారంలో పూర్తి భాగమన్న వాస్తవాన్ని స్నోడేన్ ప్రకటనలు తెలియచేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ టెలికం బహుళజాతి సంస్థలైన ఎటి &టి, వేరిజోన్ లతో సహా అమెరికన్ నిఘా ఏజెన్సీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తుంటాయి. ఈ సంస్థల దగ్గర వున్న సమాచారం  మొత్తాన్ని,  అమెరికా నేషనల్ సెక్యురిటి ఏజెన్సీ  వచ్చే 50సంవత్సరాలపాటు సర్చ్ చేయటానికి,సార్ట్ చేయటానికి,తమ డేటా బ్యాంకుల్లో స్టోర్ చేసికోవటానికి వీలుకల్పించాయి. అందువల్ల అమెరికా బహుళజాతి సంస్థలకు మన సమాచారాన్ని ఇవ్వటమంటే,అతి ప్రధానమైన ఆర్ధిక మూలాధారాలను వాళ్ళకు అప్పగించటంతో పాటు , మన దేశం లోని  ప్రస్తుత,భవిష్యత్ విధాన కర్తలను అమెరికా అతి సన్నిహితంగా పర్యవేక్షించ వీలుకల్పించట మౌతుంది.  

ప్రజోపయోగ సాధనంగా ఇంటర్నెట్ 
అనేక అంతర్జాతీయ వేదికలపై ఇంటర్నెట్ ను ప్రజోపయోగ  సాధనంగా పరిగణిస్తూ భారతదేశం విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. మన దేశ ఇంటర్నెట్ వెన్నెముకను అభివృద్ది చేయటానికి జాతీయ ఆప్టికల్ ఫైబర్ సమాహారం కోసం ఇప్పటికే మనం రూ70,000 కోట్లు ఖర్చు చేసివున్నాం.  బి ఎస్ఎన్ ఎల్ మరియు ఇతరులచే ఇప్పటికే నిర్మించబడ్డ మౌలిక వనరులలోఇది  ప్రధానమైంది. భారత రైల్వే ఇప్పటికే నిర్మించిన ఫైబెర్ ఆప్టిక్ సమాహారమైన రైల్ టెల్ ను గూగుల్,  విస్తృతమై అమలులోవున్న ఫైబర్ ఆప్టిక్ మౌళిక అవసరాలకు,  రైల్వే స్టేషన్లలో స్థాపించే వైఫై అవసరాలతో పాటు,  తమ స్వంత అవసరాలకు  ఉపయోగించ పోతున్నట్లుంది. ప్రజలు ఇంటర్నెట్ ను తమ మొబైల్లకు,కంప్యూటర్లకు కనెక్ట్ చేసికునే చివరి అంచు కనెక్టివిటీ అయిన బ్రిడ్జి ని  మాత్రమె అందించటానికి  ప్రస్తుతం గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ లు సిద్ధంగా వున్నాయి. ఇంటర్నెట్ వెన్నెముక నిర్మాణానికి అవసరమైన  అత్యధిక వ్యయాన్ని భారత ప్రభుత్వం భరిస్తుంటే, గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ లు చివరి అంచు కనెక్టివిటీని అందిస్తూ,  భారత ఇంటర్నెట్ మౌళిక సదుపాయాలపై ఉచితంగా స్వారి చేయపూనుకున్నాయి. ఈ సదుపాయం మూలంగా వాళ్ళుఉచిత సేవలు అందించే పేర మన వ్యక్తిగత డేటాలో చొరబడటానికి, వినియోగించు కోవటానికి,అమ్ముకోవటానికి వీలుకల్పించే కీలక స్థానాన్ని  పొంద కలుగుతారు. 

దీనికి భిన్నంగా చైనాలో గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ తదితరుల్ని వాళ్ళ మార్కెట్లకు దూరంగా వుంచారు. అమెరికా నుండి కాకుండా పై 10 ప్రపంచ వ్యాప్త ఐ టి కంపెనీలలో 3 చైనా కంపెనీలైన చైనీస్ సర్చ్ ఇంజన్  చైనీస్ బైదు, టెన్ సెంట్స్ మరియు ఆలి బాబా.అమెరికా ప్రత్యర్దులంత ప్రగతి సాధించలేక పోయినప్పటికీ  తన దేశీయ మార్కెట్ ను పరిరక్షించుకుంటూ,ఇంటర్నెట్ మరియు మొబైల్ వ్యాపారాన్ని చైనా సృష్టించ కలిగింది.  చైనా లాంటి ఇంటర్నెట్ లభ్యత కలిగిన మొబైల్ మార్కెట్ కలిగిన దేశాలన్నిటికి, ఆ దేశం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించ కలిగింది. 

మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనలో ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయసందర్శన  ఒక భాగం. ఫేస్ బుక్ అధినేత జుకర్బెర్గ్ తో కలిసి ఆయన ఇంటర్నెట్ ఆధారిత టౌన్ హాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా చేయటం మూలంగా ఆయన ఫేస్ బుక్ ప్రతిపాదనలకు కు సూచనప్రాయంగా ఆమోద ముద్ర వేసినట్లయింది. ఫేస్ బుక్ కూడా ప్రతిస్పందనగా  ఫేస్ బుక్ పేజికి రంగులు మార్చి డిజిటల్ ఇండియాను ఆమోదిస్తూ ప్రజల స్పందనలను అంగీకరించింది.ఫేస్ బుక్ పర్యవేక్షణలో కుదించిన ఇంటర్నెట్ ఏర్పాటుకు జుకర్బెర్గ్ చేసిన ప్రతిపాదనలను టెలికం అధికారులు పరిశీలిస్తున్న సమయంలో, ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ క్యాంపెయిన్ కు నియమ నిబంధనల నెత్తివేయడంతో పాటు, మోడీ, జుకర్బెర్గ్ ల బహిరంగ 'సరసోల్లాసాల' ప్రభావం ఎలా వుంటుందో?చూడాలి.  అంత అత్యున్నత స్థాయి పర్యటనలో, ఫేస్ బుక్ యొక్క ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ను ట్రాయ్, టెలికం,కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు పరీక్షిస్తున్నసమయంలో , భారత ప్రధాని  భారత టెలికం రూల్స్ ను ఉల్లంఘించటం , నియంత్రణ ప్రక్రియను నీరికార్చటం కాదా?

 జుకర్బెర్గ్ పేదలను  ఇంటర్నెట్ తో అనుసంధానించి వాళ్ళను పేదరికం నుండి బయట వేస్తానంటున్నాడు. ప్రపంచంలో వున్న 100కోట్ల వెబ్ సైట్లలో పేదలు చూడతగ్గవి కొద్ది సంఖ్య మాత్రమే నని, వాళ్ళు ఏమి చూడాలో తాము నిర్ణయిస్తామని, వాళ్లకు కాపలా దారులుగా వ్యవహరిస్తామని ఫేస్ బుక్ యొక్క ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ప్రతిపాదిస్తున్నది. ఈ సేవలందించి నందుకు గాను, వాళ్ళను  నెట్ న్యూట్రాలీటి  పరిధి నుండి మినహాయించాలిట. ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ వేదికను ఫ్రీ సర్వీసెస్ డాట్ ఆర్గ్ గా తిరిగి పేరు మార్చారు.

తమ వేదికను ప్రభుత్వ సేవల వాహకంగా మార్చాలన్న ఫేస్ బుక్ ప్రతిపాదన చాలా అపాయకరమైనది. మరో మాటలో చెప్పుకుంటే ఈ-గవర్నెస్ ఫేస్ బుక్ ద్వారా జరుగుతుంది. అటువంటి ప్రభుత్వ సర్వీసులు మనకు కావాలంటే మనం  ఫేస్ బుక్ దగ్గర నమోదు చేసికొని, మన వ్యక్తిగత డేటాలో చొరబాటుకు ఫేస్ బుక్ కు  వీలుకల్పిస్తూ, వాటి ప్రత్యేక నిఘా సాఫ్ట్ వేర్ ను మన మిషన్ల మీద పెట్టుకోవాలి. ఇకనుండి భారతదేశం, ఫేస్ బుక్ రిపబ్లిక్ కు సామంత రాజ్య మౌతుంది. 

యూజర్ డేటాను సరుకుగా మార్చటం 
వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని(యూజర్ డేటా) ప్రకటనదార్లకు (అడ్వెర్టైజర్లు) విక్రయించడమే ఫేస్ బుక్ వ్యాపార నమూనా. అందువల్ల ఎక్కువ డేటాను పొందకలిగితే ఎక్కువ ఆదాయాన్ని ఫేస్ బుక్ పొందకలుగుతుంది. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడి నుండి అది 12.76 డాలర్ల ఆదాయం పొందుతున్నది. 2017 నాటికి ఈ ఆదాయం 17.5 డాలర్లకు పెరుగుతుందని ఆశిస్తుంది. వినియోగదారుల నమోదు ఉత్తర ప్రపంచాన గరిష్టానికి చేరటంతో,  ఫేస్ బుక్ తమ తదుపరి ఇంటర్నెట్ వినియోగ దారుల సమూహం కోసం  తన కేంద్రీకరణను దక్షిణ ప్రపంచానికి మళ్లిస్తున్నది.

మన సమాచారంలో చొరబాటు ఫేస్ బుక్ ప్రధాన అవసరమైంది. అదే దాని వ్యాపారానికి కీలకమైన వనరు. ఫేస్ బుక్ వేదిక పై నిర్వహింపబడే ప్రతి వెబ్ సైట్ లేదా సేవ తన వినియోగదారు సమాచారాన్ని విధిగా ఫేస్ బుక్ కు అందించాల్సివుంటుంది. అందువల్ల ఈ సమాచారాన్ని అది ప్రకటనదార్లకు అమ్మకలుగుతుంది. అటువంటి వేదిక పై  వినియోగదార్ల సమాచారానికి పూర్తి చొరబాటు కలిగివున్న కారణంగా వినియోగదారుల వివరణాత్మక దృశ్యాన్ని పొందకలిగి ఫేస్ బుక్,  వ్యాపార ప్రకటనలను సంపూర్ణంగా శాసించ కలుగుతుంది. ఫేస్ బుక్ పొందే ఆదాయంతో పోల్చుకుంటే, ఆ  వేదిక పై వున్న ఇతరులు పొందే వ్యాపార ప్రకటనల ఆదాయం చిల్లర పైసలే. 


ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ కు సంబంధించి,  ఫేస్ బుక్ సేవా నమూనా లో దాని వినియోదారులకు అతి తక్కవ భద్రత వుంటుంది. మన డేటాను తాజాపరచటం కోసం ఎప్పడికప్పుడు మనం చేస్తున్న దంతా  ఫేస్ బుక్ కు తెలియాల్సిన అవసరం వుంది. అందువల్ల బ్యాంక్ ఖాతాల నిర్వహణలో గోప్యంగా వుంచే పాస్ వర్డ్ లతో సహా అన్నిరకాల భద్రతా చర్యలన్నింటిని అది  దాట వేస్తుంది. ఇంటర్నెట్ లో అధికంగా నిర్వహించే వ్యాపార లావాదేవీలలో మన డేటా పూర్తి భద్రత కోసం పాస్ వర్డ్ లాంటి డేటా భద్రతా చర్యల్ని విధిగా గోప్యంగా వుంచాల్సి వస్తుంది. ఫేస్ బుక్ వేదికలు, బ్యాంకులతో,ఇతర పేమెంట్ గేట్ వే లతో ప్రత్యక్షంగా నిర్వహించే అటువంటి భద్రతా లావాదేవీలను అనుమతించదు. అటువంటి లావాదేవీలను నిర్వహించే వేదికగా అది వున్నప్పుడు, ప్రతి లావాదేవీ మధ్య అది తప్పని సరిగా వుంటుంది.దీనిమూలంగా "ఎ మ్యాన్ ఇన్ మిడిల్ ఎటాక్" లాంటి కంప్యూటర్ ఫిషర్ ఎటాక్ కు వీలుకల్పించబడి, ఆర్ధిక వ్యవస్థ మొత్తం ఒకే ఒక్క చోట కుప్పకులే ప్రమాదముంటుంది. 

సి ఈ ఓ ల బహిరంగ ప్రకటనలకు ప్రత్యుపకారంగా రైల్వే స్టేషన్లను గూగుల్ కు, గ్రామాలను మైక్రో సాఫ్ట్ కు, భారత దేశ పేదలను  ఫేస్ బుక్ కు అప్పచేప్తూ, మోడీ వినియోగదారుల సమాచారాన్ని సరుకుగా మార్చే వ్యాపారానికి దోహదపడుతున్నారు. అమెరికా బహుళజాతి సంస్థలకు మన వ్యక్తిగత సమాచారం లో చొరబడటానికి ప్రత్యేక హక్కులివ్వడ మంటే మన సమాచారాన్నివాడుకోవటానికి  అమెరికన్ నిఘా ఏజెన్సీలకు  పూర్తీ స్వేచ్చ నివ్వటమే. ఈ దేశాన్ని పాలించటం కంటే మీడియా సూర్యుడిలో ఎండ గాచుకోవటానికి ఇష్టపడే ప్రధాన మంత్రి తన నిష్ఫల వైభవం కోసం ఇదంతా చేస్తున్నట్లుంది. వ్యక్తిగత సమాచారాన్ని సరుకుగా మార్చే ప్రక్రియ డిజిటల్ ఆర్ధిక వ్యవస్థను నడిపించటమే కాకుండా డిజిటల్ వలస పాలనను సుగమం చేస్తుంది.
స్వేచ్చానువాదం: కొండముది లక్ష్మీ ప్రసాద్