Tuesday, October 20, 2015

మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటన-
 ప్రచార హోరు కోసం డిజిటల్ వలసవాదానికి ఆహ్వానం 

ప్రబీర్ పురకాయస్థ 

అమెరికా  హైటెక్ ఐటీ పరిశ్రమ కు జన్మస్థలమైన సిలికాన్ వ్యాలీని ఇటీవల సందర్శించినప్పుడు, లాస్ఏంజెల్స్ నందలి శాప్  సెంటర్లో మోడీ  తన స్వంత ట్రేడ్ మార్క్ కల్గిన  హావభావ ప్రదర్శనను అందించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా కంపెనీల సియీఒ ల సమావేశాన్ని, ఫేస్ బుక్ సంస్థాపక అధినేత మార్క్ జుకర్బెర్గ్ టౌన్ హాల్ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ఈ ప్రదర్శన తో ఆయన జతచేశారు. అభాసు పాలైన ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ నమూనాకు  కొత్తరూపమిస్తూ ఫేస్ బుక్  డిజిటల్ ఇండియా కు మద్దతు  క్యాంపెయిన్ సృష్టించటం, భారతదేశంలో గ్రామాలను బ్రాడ్ బ్యాండ్ తో  అనుసంధానిస్తామని మైక్రోసాఫ్ట్  ముందుకు రావటం, 500ల భారత రైల్వే స్టేషన్లలో వైఫై సేవల నందిస్తామని గూగుల్ వాగ్దానం చేయటం' మోడీ పర్యటన మహత్తర విజయాలుగా  భారతదేశంలో వార్తాపత్రికలు మొదటి పేజి హెడ్ లైన్స్ పెట్టాయి. కాని భారతదేశ  డిజిటల్ మార్కెట్ ను హస్తగతం చేసికోవాలనే  ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్,గూగుల్ లాంటి సంస్థల ఆకాంక్షల నంగీకరిస్తూ ఈ పర్యటన సందర్భంగా  మోడీ వేసిన రాజముద్రను ఈ ప్రచార హోరు మరుగున  పెట్టింది.

భారత దేశానికి బ్రిటిష్ వాళ్ళు రాగానే,ఇక్కడి రాజులు,నవాబులు ఎంతో ఉత్తేజితులైనారన్న  వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. ధన సంపాదనకు రెడీమేడ్ వనరు దొరికిందని వారు భావించారు. వాళ్ళ విలాసవంతజీవితంకోసం, క్షీణిస్తున్న జీవన విదానంమార్పు కోసం వాళ్లకు అప్పులివ్వటానికి బ్రిటిష్ వర్తకులు, ఈస్టిండియా  కంపెనీ  స్థానికులతో పోటీ  పడ్డారు.కంపెనీ నుండి తీసికున్న అప్పుల్ని తిరిగి కట్టాల్సిన అవసరంలేదని బహుశా వాళ్ళు భావించి వుంటారు.కాని అంతిమంగా  వాళ్ళ జీవితాలతో పాటు భారత  దేశాన్నే బ్రిటిష్ వాళ్ళకు అప్పగించాల్సి వచ్చింది.

బ్రిటిష్ వాళ్ళు మహా సాగరాలనే అదుపు చేయగలిగి యున్నందున,  రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించకలిగారు.ఈ రోజుల్లో డిజిటల్ మహా సాగారాల్ని నియంత్రించ కల్గిన వాళ్ళు ప్రపంచాన్నే శాసించగలరు. కొద్ది గంటల పాటు కొనసాగే భారతదేశ మీడియాలో 'వైభవం' కోసం గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ లాంటి అమెరికా బహుళజాతి సంస్థలకు మోడీ అందిస్తున్న  బహుమానమిదే.
ఇది ఇంతటితో ఆగలేదు. గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ మరియు ఇతర టెలికం కంపెనీలు నేషనల్ సెక్యురిటి ఏజెన్సీ లోను, పంచ నేత్రాల (యుఎస్,యుకె, కెనడా,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్) ప్రపంచ నిఘా సమాహారంలో పూర్తి భాగమన్న వాస్తవాన్ని స్నోడేన్ ప్రకటనలు తెలియచేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ టెలికం బహుళజాతి సంస్థలైన ఎటి &టి, వేరిజోన్ లతో సహా అమెరికన్ నిఘా ఏజెన్సీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తుంటాయి. ఈ సంస్థల దగ్గర వున్న సమాచారం  మొత్తాన్ని,  అమెరికా నేషనల్ సెక్యురిటి ఏజెన్సీ  వచ్చే 50సంవత్సరాలపాటు సర్చ్ చేయటానికి,సార్ట్ చేయటానికి,తమ డేటా బ్యాంకుల్లో స్టోర్ చేసికోవటానికి వీలుకల్పించాయి. అందువల్ల అమెరికా బహుళజాతి సంస్థలకు మన సమాచారాన్ని ఇవ్వటమంటే,అతి ప్రధానమైన ఆర్ధిక మూలాధారాలను వాళ్ళకు అప్పగించటంతో పాటు , మన దేశం లోని  ప్రస్తుత,భవిష్యత్ విధాన కర్తలను అమెరికా అతి సన్నిహితంగా పర్యవేక్షించ వీలుకల్పించట మౌతుంది.  

ప్రజోపయోగ సాధనంగా ఇంటర్నెట్ 
అనేక అంతర్జాతీయ వేదికలపై ఇంటర్నెట్ ను ప్రజోపయోగ  సాధనంగా పరిగణిస్తూ భారతదేశం విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. మన దేశ ఇంటర్నెట్ వెన్నెముకను అభివృద్ది చేయటానికి జాతీయ ఆప్టికల్ ఫైబర్ సమాహారం కోసం ఇప్పటికే మనం రూ70,000 కోట్లు ఖర్చు చేసివున్నాం.  బి ఎస్ఎన్ ఎల్ మరియు ఇతరులచే ఇప్పటికే నిర్మించబడ్డ మౌలిక వనరులలోఇది  ప్రధానమైంది. భారత రైల్వే ఇప్పటికే నిర్మించిన ఫైబెర్ ఆప్టిక్ సమాహారమైన రైల్ టెల్ ను గూగుల్,  విస్తృతమై అమలులోవున్న ఫైబర్ ఆప్టిక్ మౌళిక అవసరాలకు,  రైల్వే స్టేషన్లలో స్థాపించే వైఫై అవసరాలతో పాటు,  తమ స్వంత అవసరాలకు  ఉపయోగించ పోతున్నట్లుంది. ప్రజలు ఇంటర్నెట్ ను తమ మొబైల్లకు,కంప్యూటర్లకు కనెక్ట్ చేసికునే చివరి అంచు కనెక్టివిటీ అయిన బ్రిడ్జి ని  మాత్రమె అందించటానికి  ప్రస్తుతం గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ లు సిద్ధంగా వున్నాయి. ఇంటర్నెట్ వెన్నెముక నిర్మాణానికి అవసరమైన  అత్యధిక వ్యయాన్ని భారత ప్రభుత్వం భరిస్తుంటే, గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ లు చివరి అంచు కనెక్టివిటీని అందిస్తూ,  భారత ఇంటర్నెట్ మౌళిక సదుపాయాలపై ఉచితంగా స్వారి చేయపూనుకున్నాయి. ఈ సదుపాయం మూలంగా వాళ్ళుఉచిత సేవలు అందించే పేర మన వ్యక్తిగత డేటాలో చొరబడటానికి, వినియోగించు కోవటానికి,అమ్ముకోవటానికి వీలుకల్పించే కీలక స్థానాన్ని  పొంద కలుగుతారు. 

దీనికి భిన్నంగా చైనాలో గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ తదితరుల్ని వాళ్ళ మార్కెట్లకు దూరంగా వుంచారు. అమెరికా నుండి కాకుండా పై 10 ప్రపంచ వ్యాప్త ఐ టి కంపెనీలలో 3 చైనా కంపెనీలైన చైనీస్ సర్చ్ ఇంజన్  చైనీస్ బైదు, టెన్ సెంట్స్ మరియు ఆలి బాబా.అమెరికా ప్రత్యర్దులంత ప్రగతి సాధించలేక పోయినప్పటికీ  తన దేశీయ మార్కెట్ ను పరిరక్షించుకుంటూ,ఇంటర్నెట్ మరియు మొబైల్ వ్యాపారాన్ని చైనా సృష్టించ కలిగింది.  చైనా లాంటి ఇంటర్నెట్ లభ్యత కలిగిన మొబైల్ మార్కెట్ కలిగిన దేశాలన్నిటికి, ఆ దేశం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించ కలిగింది. 

మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనలో ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయసందర్శన  ఒక భాగం. ఫేస్ బుక్ అధినేత జుకర్బెర్గ్ తో కలిసి ఆయన ఇంటర్నెట్ ఆధారిత టౌన్ హాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా చేయటం మూలంగా ఆయన ఫేస్ బుక్ ప్రతిపాదనలకు కు సూచనప్రాయంగా ఆమోద ముద్ర వేసినట్లయింది. ఫేస్ బుక్ కూడా ప్రతిస్పందనగా  ఫేస్ బుక్ పేజికి రంగులు మార్చి డిజిటల్ ఇండియాను ఆమోదిస్తూ ప్రజల స్పందనలను అంగీకరించింది.ఫేస్ బుక్ పర్యవేక్షణలో కుదించిన ఇంటర్నెట్ ఏర్పాటుకు జుకర్బెర్గ్ చేసిన ప్రతిపాదనలను టెలికం అధికారులు పరిశీలిస్తున్న సమయంలో, ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ క్యాంపెయిన్ కు నియమ నిబంధనల నెత్తివేయడంతో పాటు, మోడీ, జుకర్బెర్గ్ ల బహిరంగ 'సరసోల్లాసాల' ప్రభావం ఎలా వుంటుందో?చూడాలి.  అంత అత్యున్నత స్థాయి పర్యటనలో, ఫేస్ బుక్ యొక్క ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ను ట్రాయ్, టెలికం,కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు పరీక్షిస్తున్నసమయంలో , భారత ప్రధాని  భారత టెలికం రూల్స్ ను ఉల్లంఘించటం , నియంత్రణ ప్రక్రియను నీరికార్చటం కాదా?

 జుకర్బెర్గ్ పేదలను  ఇంటర్నెట్ తో అనుసంధానించి వాళ్ళను పేదరికం నుండి బయట వేస్తానంటున్నాడు. ప్రపంచంలో వున్న 100కోట్ల వెబ్ సైట్లలో పేదలు చూడతగ్గవి కొద్ది సంఖ్య మాత్రమే నని, వాళ్ళు ఏమి చూడాలో తాము నిర్ణయిస్తామని, వాళ్లకు కాపలా దారులుగా వ్యవహరిస్తామని ఫేస్ బుక్ యొక్క ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ప్రతిపాదిస్తున్నది. ఈ సేవలందించి నందుకు గాను, వాళ్ళను  నెట్ న్యూట్రాలీటి  పరిధి నుండి మినహాయించాలిట. ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ వేదికను ఫ్రీ సర్వీసెస్ డాట్ ఆర్గ్ గా తిరిగి పేరు మార్చారు.

తమ వేదికను ప్రభుత్వ సేవల వాహకంగా మార్చాలన్న ఫేస్ బుక్ ప్రతిపాదన చాలా అపాయకరమైనది. మరో మాటలో చెప్పుకుంటే ఈ-గవర్నెస్ ఫేస్ బుక్ ద్వారా జరుగుతుంది. అటువంటి ప్రభుత్వ సర్వీసులు మనకు కావాలంటే మనం  ఫేస్ బుక్ దగ్గర నమోదు చేసికొని, మన వ్యక్తిగత డేటాలో చొరబాటుకు ఫేస్ బుక్ కు  వీలుకల్పిస్తూ, వాటి ప్రత్యేక నిఘా సాఫ్ట్ వేర్ ను మన మిషన్ల మీద పెట్టుకోవాలి. ఇకనుండి భారతదేశం, ఫేస్ బుక్ రిపబ్లిక్ కు సామంత రాజ్య మౌతుంది. 

యూజర్ డేటాను సరుకుగా మార్చటం 
వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని(యూజర్ డేటా) ప్రకటనదార్లకు (అడ్వెర్టైజర్లు) విక్రయించడమే ఫేస్ బుక్ వ్యాపార నమూనా. అందువల్ల ఎక్కువ డేటాను పొందకలిగితే ఎక్కువ ఆదాయాన్ని ఫేస్ బుక్ పొందకలుగుతుంది. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడి నుండి అది 12.76 డాలర్ల ఆదాయం పొందుతున్నది. 2017 నాటికి ఈ ఆదాయం 17.5 డాలర్లకు పెరుగుతుందని ఆశిస్తుంది. వినియోగదారుల నమోదు ఉత్తర ప్రపంచాన గరిష్టానికి చేరటంతో,  ఫేస్ బుక్ తమ తదుపరి ఇంటర్నెట్ వినియోగ దారుల సమూహం కోసం  తన కేంద్రీకరణను దక్షిణ ప్రపంచానికి మళ్లిస్తున్నది.

మన సమాచారంలో చొరబాటు ఫేస్ బుక్ ప్రధాన అవసరమైంది. అదే దాని వ్యాపారానికి కీలకమైన వనరు. ఫేస్ బుక్ వేదిక పై నిర్వహింపబడే ప్రతి వెబ్ సైట్ లేదా సేవ తన వినియోగదారు సమాచారాన్ని విధిగా ఫేస్ బుక్ కు అందించాల్సివుంటుంది. అందువల్ల ఈ సమాచారాన్ని అది ప్రకటనదార్లకు అమ్మకలుగుతుంది. అటువంటి వేదిక పై  వినియోగదార్ల సమాచారానికి పూర్తి చొరబాటు కలిగివున్న కారణంగా వినియోగదారుల వివరణాత్మక దృశ్యాన్ని పొందకలిగి ఫేస్ బుక్,  వ్యాపార ప్రకటనలను సంపూర్ణంగా శాసించ కలుగుతుంది. ఫేస్ బుక్ పొందే ఆదాయంతో పోల్చుకుంటే, ఆ  వేదిక పై వున్న ఇతరులు పొందే వ్యాపార ప్రకటనల ఆదాయం చిల్లర పైసలే. 


ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ కు సంబంధించి,  ఫేస్ బుక్ సేవా నమూనా లో దాని వినియోదారులకు అతి తక్కవ భద్రత వుంటుంది. మన డేటాను తాజాపరచటం కోసం ఎప్పడికప్పుడు మనం చేస్తున్న దంతా  ఫేస్ బుక్ కు తెలియాల్సిన అవసరం వుంది. అందువల్ల బ్యాంక్ ఖాతాల నిర్వహణలో గోప్యంగా వుంచే పాస్ వర్డ్ లతో సహా అన్నిరకాల భద్రతా చర్యలన్నింటిని అది  దాట వేస్తుంది. ఇంటర్నెట్ లో అధికంగా నిర్వహించే వ్యాపార లావాదేవీలలో మన డేటా పూర్తి భద్రత కోసం పాస్ వర్డ్ లాంటి డేటా భద్రతా చర్యల్ని విధిగా గోప్యంగా వుంచాల్సి వస్తుంది. ఫేస్ బుక్ వేదికలు, బ్యాంకులతో,ఇతర పేమెంట్ గేట్ వే లతో ప్రత్యక్షంగా నిర్వహించే అటువంటి భద్రతా లావాదేవీలను అనుమతించదు. అటువంటి లావాదేవీలను నిర్వహించే వేదికగా అది వున్నప్పుడు, ప్రతి లావాదేవీ మధ్య అది తప్పని సరిగా వుంటుంది.దీనిమూలంగా "ఎ మ్యాన్ ఇన్ మిడిల్ ఎటాక్" లాంటి కంప్యూటర్ ఫిషర్ ఎటాక్ కు వీలుకల్పించబడి, ఆర్ధిక వ్యవస్థ మొత్తం ఒకే ఒక్క చోట కుప్పకులే ప్రమాదముంటుంది. 

సి ఈ ఓ ల బహిరంగ ప్రకటనలకు ప్రత్యుపకారంగా రైల్వే స్టేషన్లను గూగుల్ కు, గ్రామాలను మైక్రో సాఫ్ట్ కు, భారత దేశ పేదలను  ఫేస్ బుక్ కు అప్పచేప్తూ, మోడీ వినియోగదారుల సమాచారాన్ని సరుకుగా మార్చే వ్యాపారానికి దోహదపడుతున్నారు. అమెరికా బహుళజాతి సంస్థలకు మన వ్యక్తిగత సమాచారం లో చొరబడటానికి ప్రత్యేక హక్కులివ్వడ మంటే మన సమాచారాన్నివాడుకోవటానికి  అమెరికన్ నిఘా ఏజెన్సీలకు  పూర్తీ స్వేచ్చ నివ్వటమే. ఈ దేశాన్ని పాలించటం కంటే మీడియా సూర్యుడిలో ఎండ గాచుకోవటానికి ఇష్టపడే ప్రధాన మంత్రి తన నిష్ఫల వైభవం కోసం ఇదంతా చేస్తున్నట్లుంది. వ్యక్తిగత సమాచారాన్ని సరుకుగా మార్చే ప్రక్రియ డిజిటల్ ఆర్ధిక వ్యవస్థను నడిపించటమే కాకుండా డిజిటల్ వలస పాలనను సుగమం చేస్తుంది.
స్వేచ్చానువాదం: కొండముది లక్ష్మీ ప్రసాద్  

No comments: